హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ చేసినా, గుడికి వెళ్లినా దంపతులు కలిసి వెళ్లాలి. అలా దంపతులు కలిసి పూజ ఎందుకు చేయాలి..? మన పూర్వికులు ఎందుకు అలా చ ప్పారో తెలుసుకుందాం. మన హూం సాంప్రదాయం ప్రకారం స్త్రీని శక్తితో పోలుస్తారు. అటువంటి స్త్రీని పక్కన పెట్టుకుని మగవాడు పూజలు చేయడం వల్ల అంతా మంచి జరిగి అతనికి అన్నింటితో విజయం సాధిస్తాడు. అందుకే దంపతులు
కలిసి పూజ చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దంపతులు ఇద్దరు ఒకరి శరీరంలో ఒకరు అర్ధభాగం అంటారు. అందుకే పరమశివుడిని అర్ధనాదీశ్వరుడి రూపంలో కొలుస్తారు. అందుకే వారిద్దరూ కష్టసుఖాల్లో, పూజా కార్యక్రమాల్లో అన్నింటిల్లో పాలుపంచుకోవాలి. దీనివలన ఇద్దరికి మంచి ఫలితం ఉంటుంది.