విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ ‘నక్షత్రం ‘

 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. 
 
‘నక్షత్రం’ చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ  గీతాన్ని  ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో  సుప్రీం హీరో ‘సాయి ధరమ్ తేజ్’ పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే  నెలలో  ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. ‘పోలీస్ ‘అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’ చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here