వాన్నా క్రై గత కొద్దిరోజులుగా ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నవైరస్. ఈ వైరస్ దెబ్బతో ప్రపంచదేశాలన్నీ లబోదిబోమంటున్నాయి. పీఎం లేదు, సీఎం లేదు ఎవరైనా ఒకటే అన్నట్లు తమ వ్యక్తిగత కంప్యూటర్లలో చొరబడి రహస్యాలన్నీ విస్పోటనం చేస్తుంది. ఈ వైరస్ పనితీరు బ్యాంకులన్నీ దివాళ తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి. అక్రమార్కుల నల్లధనం బ్యాంకుల్లో మూలుగుతుంటే వాన్నాక్రై సాయంతో మొత్తాన్ని తుడిచి పెట్టుకుపోతున్నాయని నేషనల్ మీడియా కథనాల్ని ప్రచారం చేసింది.
ఎవరి సొమ్ము ఎంత పోయిందనే దానిపై వివరణ కోరగా ఇందులో రాజకీయనాయకుల దగ్గరనుంచి అంతర్జాతీయ సెలబ్రెటీల పేర్లు ప్రచారం లో ఉన్నాయి.
అయితే ఈ వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే బ్యాంకు లావాదేవీల్లో నిలిపివేయాలని ఆర్బీఐ అన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే బ్యాంకు ట్రాన్సాక్షన్లు కానీ, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడంలాంటి చర్యలు చేపడితే వైరస్ ఖాతాదారుల అకౌంట్ లోపై ప్రభావం చూపనుంది. ఎవరైనా ట్రాన్సాక్షన్లు జరపకుండా తమ డబ్బు పోయింది అనుకుంటే అది వాన్నాక్రై ఎఫెక్ట్ అని అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఓ వారం రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరపకపోవడం ఉత్తమమే అని ప్రచారం జరుగుతుంది.