డబ్బులునా ఏటీఎం లు క్లోజ్ .. డబ్బుల్లేక జనం విల విల

వన్నా క్రై ఇప్పుడు ఇండియా లో కూడా గట్టిగా పాకేసింది. గత మూడు రోజులుగా విండోస్ లోని చిన్న చిన్న లోపాలతో కంప్యూటర్ లలోకి విస్తరిస్తూ ప్రపంచాన్ని ఆడుకుంటున్న ఈ వైరస్ భయం తో ఏటీఎం కష్టాలు మొదలు అయ్యాయి. ఏటీఎంలలో పాతతరం విండోస్ ఎక్స్ పీ సాఫ్ట్ వేర్ వాడుతుండడంతో ముందు జాగ్రత్తగా వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలను మూసేశారు.

నిన్నటికే ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలు మూతపడగా, నేడు ప్రభుత్వ బ్యాంకులు కూడా మూసేయిస్తున్న ఏటీఎంల జాబితాలో చేరాయి. ఏటీఎం లు దాదాపు గా మూత పడ్డాయి అని తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాల్లో పలువురు డిజిటల్ సేవలను వినియోగించుకుంటుండగా, సాధారణ ప్రజానీకం మాత్రం నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ హ్యాకింగ్ గొడవ ఇంకెన్నాళ్ళు నడుస్తుందో తెలీక జనం తలలు పట్టుకుంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here