బాహుబలి లాంటి అల్ ఇండియా బ్లాక్ బస్టర్ తరవాత రాజమౌళి రేంజ్ ఊహించనంత ఎత్తుకి ఎదిగిపోయింది. కర్నూలు జిల్లా మంత్రాలయం కి వెళ్లి ఆయన దర్సనం చేసుకునే టైం లో రాజమౌళి కి భారీ అభిమానం గళం చేరుకున్నారు.రాజమౌళితో మాట్లాడాలని, సెల్ఫీలు దిగాలని భావించిన ఎంతో మంది ఆలయానికి రాగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
సేల్ఫీ కోసం ఒక్క ఫోటో సర్ సర్ అంటూ అరుస్తున్నా రాజమౌళి కనీసం వారిని పట్టించుకోవడం మానేసి హడావిడి గా వెళ్ళిపోయారు. పలువురు చిన్నారులు, మహిళలు ఆయనతో ఫోటోలు దిగాలన్న కోరికతో వాహనాన్ని చుట్టు ముట్టి ఎంతగా పిలిచినా రాజమౌళి స్పందించలేదు. దీంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.