మరో అంతు చిక్కని మస్టరీ టైం ట్రావెలింగ్ ఏరో ప్లెయిన్ .ఈ కథ తెలియాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్లాలి. 1955లో 55మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుండి మియామీకి విమానం 914 బయలు దేరింది. అది నేలకు చేరుకోవడానికి 37ఏడేళ్లు పట్టింది. ఈ మధ్యలో ఆ విమానం ఎక్కడుంది. ఇన్నేళ్లు ఆకాశంలో ఎలా ఉండగలింది అనేది పెద్ద మిస్టరీ.1992లో వెనిజులా కార్కస్ విమానాశ్రయం రాడార్ ఓ ప్లైయిట్ సడన్ గా ప్రత్యక్షమైంది. మీరు ఎవరు అని కంట్రోల్ రూం నుంచి పైలెట్ కు మెసేజ్ పంపించారు. మేము మియామీలో దిగాలి అనే సమాధానం వచ్చింది.
మీ విమానం తప్పిపోయిందా అనిఅడిగితే పైలెట్ నుంచి సమాధానం లేదు. అయినా ల్యాండింగ్ కి పర్మీషన్ ఇచ్చారు. దాదాపు 35ఏళ్ల తరువాత నేలపైకి దిగింది ఆ విమానం. అప్పుడే పైలెట్ కు కోపైలెట్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆసంభాషణ అంతా రికార్డు అయ్యింది. వాళ్లు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తుంటే జిమ్మీ మనం 1955లో బయలు దేరాం. ఉదయం 9.30 దిగాలి. జీసెస్ క్రైస్ట్ అనే మాటలు వినపడ్డాయి. ఈ మాటలు విన్న విమానాశ్రయ సిబ్బంది మీ హెల్త్ చెకప్ కోసం స్టాఫ్ ను పంపిస్తున్నాం. అని కంట్రోల్ రూంనుంచి సమాధానం వెళ్లింది. అప్పటికే కంట్రోల్ రూంలో అంతా టెన్షన్ విమానంలో ఎవరు ఉన్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నారని.
కానీ పైలెట్ ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. లోపలినుండే చెయ్యి ఊపిచెప్పాడు. అతని చేతిలో ఓ ఫైల్ కూడా ఉంది. మా ఫ్లైయిట్ కు పర్మీషన్ ఇవ్వండని గాల్లోకి ఎగిరి పోయాడు. ఆ తరువాత విమానం మియామీలో దిగింది. ఇన్నాళ్లు ఆ విమానం ఎక్కుడుంది అనేది ఎవరికి అంతు చిక్కని రహస్యం. టైం ట్రావెలింగ్ లో తిరిగారు. అందుకే కాలం వేగంగా మారిపోయిందని అంటున్నారు. అయితే ఆ పైలెట్లను ఆదీనంలోకి తీసుకున్న సీఐఏ ఏం జరిగిందో చెప్పలేదు. కానీ ఫ్లోరిడాలోకి వెళ్లగానే విమానం మాయమైంది. ఆ విమానం కూలిపోయిందని బంధువులంతా అనుకున్నారు.
వారికి నష్టపరిహారం భారీగానే చెల్లించారు. తప్పిన విమానం ప్రత్యక్షమై తమపిల్లు ముసలివాళ్లై పోవడం చూసి షాకయ్యారు. అయితే ఆ టైంలో విమానం ఎక్కడుందనేది ఎవరికి తెలియని ప్రశ్న.