కోర్కెలు తీర్చమని భక్తులు పూజలు చేస్తుంటారు. గుళ్లు గోపురాలు, పూజలు పురస్కరాలు అంటూ భగవంతని నామస్మరణతో తమ జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. అయితే కొంతమంది దేవుడి సాష్టాంగ నమస్కారం చేసి కష్టాల నుంచి తొలగించాలని కోరుకుంటారు. కానీ సాష్టాంగ నమస్కారాలు మగవారు చేయవచ్చు. ఆడవాళ్లు మాత్రం ఎక్కడా సాష్టాంగ నమస్కారాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. సకల ప్రాణకోటి సృష్టి ఆడవాళ్ల ఉదరం .
వృక్షస్థలం సకల ప్రాణులకు బతుకునిచ్చేది. విశ్వాన్ని మోస్తుంది. విశ్వాన్ని బ్రతికిస్తుంది. వాటిన్నింటికి ప్రతినిధి ఎవరు దేవుడు. కాబట్టే ఆడవాళ్లు సాష్టాంగ నమస్కారాలు చేయడం, వృక్షస్థలాన్ని ఇష్టాను సారం ఉపయోగించడం చేయరాదు. షడంగా నమస్కారాలు మాత్రమే చేయాలి.