గోమాతలో సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గోమాతను ‘ఆశ్వయుజ బహుళ ద్వాదశి’ రోజున దూడతో కూడిన గోవుని పూజిస్తారు. అయితే గోమాతలో అంతమంది దేవతలు ఎందుకు ఉన్నారన్న సందేహం చాలామంది మొదిలో తొలుస్తుంటుంది. వేద పండితులు చెప్పిన వివరాల ఆధారంగా
గోమాత కామదేనువుగా అవతరించిన తరువాత ఆమెను పూజ చేయడం కోసం, ఆమెలో స్థానం కల్పించుకోవడం కోసం దేవతలందరూ ఒక్కోస్థానాన్ని ఆక్రమించుకున్నారు.
అలాంటి గోమాతలో 33కోట్ల మంది దేవతులున్నారు. చివరికి మిగిలిపోయిన లక్ష్మీదేవి కామదేనువులో స్థానం కోసం నేనెక్కడ అని అడిగినప్పుడు నీకు గోమయంలో(ఆవుపేడ) స్థానం కల్పిస్తున్నానను అని గోమాత అన్నదట. అందుకే పెద్దలు గోమయే వసతి లక్ష్మీ అని ఉచ్చరిస్తుంటారు.