శోభనం గదిలోకి వెళ్ళిన ఆ అమ్మాయి శవం గా బయటకి వచ్చింది ..
ఎన్నో ఆశలతో అత్తవారి ఇంట్లో అడుగు పెట్టిన ఆమె శోభనం పూర్తి అయిన ఉదయమే శవంగా తేలింది. అర్ధరాత్రి మొదలైన శోభనం ముహూర్తం ఉదయం అయ్యే సరికి ఆమెని శవం గామార్చేసింది. వివరాలు చూస్తే నల్గొండ జిల్లా లోని అనూష (26) ఒకబ్బాయిని ప్రేమించింది. చాలా కాలం కలిసి తిరిగారు ఇద్దరూ.. కానీ అతని సరైన వాడు కాదు అని తెలుసుకుని అతని నుంచి ఆమె విడిపోయి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్దపడింది . ఆమె మాటని మన్నించిన పెద్దలు వెంకటేశ్వరులు అనే వ్యక్తి తో పెళ్లి సెట్ చేసారు. గ్రాండ్ గా పెళ్లి జరిగింది.శోభనం రోజు భర్త అనుషను ని సరదా కోసం తన గురించి చెప్పమన్నాడు. ఏ విషయమైనా దాపురికం లేకుండా చెప్పాలని కండిషన్ పెట్టాడు. ఎలాంటి విషయం చెప్పినా ఫీల్ అవ్వను అని ఓపెన్ ఐపొయిన అతన్ని నమ్మి తన గతం అంతా చెప్పేసింది అనుష. దాంతో అతను తన రాక్షస రూపం బయట పెట్టాడు. ఆమె తన స్టోరీ చెబుతూ ఉండగానే పట్టరాని కోపం తో అనుషను పీక పిసికి చంపేసాడు. తనకు సరిపడదు అనుకుంటే అనుషను అంతటితో ఒదిలి వేసినా తన బతుకు తాను బతికేది.