వందే భారత్ మిషన్: భారత్ చేరుకున్న తొలి విమానం

లా క్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘’లో భాగంగా తొలి విమానం దేశానికి చేరుకుంది. 177 ప్రయాణికులతో అబుదాబి నుంచి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో ల్యాండ్ అయింది. వీరిలో 49 మంది గర్భిణులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరందరూ తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.

అటు సముద్ర సేతు ఆపరేషన్‌లో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీ చేరుకున్న తొలి నౌక తిరిగి పయనమైంది. ఇండియన్ నేవీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ యుద్ధనౌక 1000 మంది ప్రయాణికులను తీసుకొని శుక్రవారం సాయంత్రానికి కోచి తీరం చేరుకోనుంది. భారత్ ‘ఐఎన్‌ఎస్‌ మగర్‌’ అనే మరో యుద్ధనౌకను కూడా మాలీకి పంపించింది.

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో సుమారు లక్షలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం (మే ) నుంచి భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందు కోసం ప్రత్యేక విమానాలను, నౌకలను పంపించింది. విమానాల ద్వారా భారతీయుల తరలింపును ‘వందే భారత్ మిషన్’గా, ఓడల ద్వారా తరలింపును ‘సముద్ర సేతు’ ఆపరేషన్‌గా పిలుస్తున్నారు.

Also Read:

గల్ఫ్ దేశాల్లో ఎక్కువ మంది భారతీయులు చిక్కుకోవడం, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికే ప్రాధాన్యం ఇస్తోంది. వందే భారత్ ఆపరేషన్‌లో గల్ఫ్‌ ప్రాంతం నుంచే ఎక్కువ మంది భారతీయులు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆపరేషన్ కోసం ఎయిర్‌ ఇండియా 64 విమానాలను నడుపుతోంది. మే 13 వరకూ సాగే మొదటి విడత కార్యక్రమంలో ఎయిర్‌ ఇండియా 12 దేశాల్లోని దాదాపు 15 వేల మంది భారతీయులను తరలించనుంది. ఇందు కోసం నాన్‌ షెడ్యూల్డ్‌ వాణిజ్య విమాన సర్వీసులను నడుపుతుంది. మే 13 తర్వాత ఈ ప్రక్రియలో ప్రైవేట్ విమానయాన సంస్థలకు కూడా పాలుపంచుకునే అవకాశం ఉంది. అవసరమైతే.. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలను కూడా ఇందు కోసం వినియోగించుకోనున్నారు. భారత వైమానిక దళం తన సి-17 గ్లోబ్‌మాస్టర్‌, సి-130జె సూపర్‌ హెర్క్యులెస్‌ సహా సుమారు 30 విమానాలను సిద్ధం చేసింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here