లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిపోయిన ఎమర్జెన్సీ కేసులు.. వైద్యులే ఆశ్చర్యపోయేలా!

దేశంలో వేళ రోడ్డు ప్రమాదాలే కాదు, హాస్పిటల్స్‌కు వచ్చే అత్యవసర కేసుల సంఖ్య, మరణాలు కూడా గణనీయంగా తగ్గిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుండెపోట్లు, హృద్రోగం సహ ఇతర ఎమర్జెన్సీ కేసుల తగ్గిపోవడం కేవలం భారత్‌లోనే కాదని, మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. దీనికంతటికీ తక్కువ ఒత్తిడి, కాలుష్యం తగ్గడమూ కూడా కారణమని, మరికొందరు అవసరమైతనే వైద్యు సేవలవైపు చూస్తున్నారని వైద్యులు అంటున్నారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో 2017 మార్చిలో 729 మరణాలు, 2018 మార్చిలో 833, గతేడాది 937 మంది చనిపోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 595గా ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల ప్రస్తుతం ఇంచు మించు ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు రాయిటర్స్ నివేదిక తెలిపింది.

దేశంలోని ఎమర్జెన్సీ అడ్మిషన్లు అకస్మాత్తుగా 50 నుంచి 60 శాతం మేర పడిపోయినట్టు పలువురు వైద్యులు ట్విట్టర్‌లో చర్చించుకుంటున్నారు. అయితే, రవాణా సౌకర్యాల ఇబ్బంది, ఒంటరిగా హాస్పిటల్‌కు వచ్చే పరిస్థితి లేదని వారు అంటున్నారు. ‘రోజువారీ జీవితంలో శ్రమ లేకపోవడం, పని సంబంధిత ఒత్తిడి, కాలుష్యం తగ్గడంతో పాటు బయట ఆహారానికి దూరంగా ఉండటంతో ట్రాన్స్‌ఫ్యాట్స్ తగ్గడం.. ప్రజలు కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని గడపడం ఖచ్చితంగా తీవ్రమైన కరోనరీ లాంటి అత్యవసర పరిస్థితులను తగ్గించడానికి సహాయపడింది. ఎమర్జెన్సీ అయితే ప్రజలు ఖచ్చితంగా ఆసుపత్రికి వెళతారు’ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి అన్నారు.

మన జీవనశైలికి సంబంధించి గుండెపోటు, స్ట్రోక్‌లు కనుమరుగయ్యాయి.. అనేక పెద్ద ఆసుపత్రులలో మిగతా చెల్లింపులు చికిత్స కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వైద్య వృత్తిని ఆత్మపరిశీలన చేసుకోవాలని, లాక్‌డౌన్ వ్యవధిలో ప్రజలు చాలా ఆరోగ్యం ఉన్నట్టు అర్ధమవుతోందని ఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ ఓపీ యాదవ్ పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వైద్యం విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల అమెరికాలో ఏడాదికి 2 లక్షల మంది మరణిస్తారు.. భారత్‌లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి.. కానీ, ఈ సమయంలో ఇలాంటి మరణాలు తగ్గాయన్నారు.

‘ఏదైనా శస్త్రచికిత్స సమయంలో ముప్పు లేదా మరణాలు చోటుచేసుకుంటాయి. శస్త్రచికిత్సలలో మరణాల రేటు 3 శాతంగా ఉంటే, లాక్‌డౌన్ తర్వాత అవి కొద్దికాలం తగ్గుతాయి. లండన్‌లో పొగమంచు కారణంగా మరణాలలో భారీ పెరుగుదల నమోదయ్యింది. దాదాపు 4,000 మంది మరణించారు. దీనికి విరుద్ధంగా కాలుష్యం తగ్గడం అంటే పెద్ద సంఖ్యలో మరణాలు నివారించబడతాయి. భౌతిక దూరంతో న్యుమోనియా, దానితో సంబంధం ఉన్న సమస్యలు, మరణాలు గణనీయంగా తగ్గుతాయి’అని ఢిల్లీలోని ఆస్తమా చెస్ట్ అలెర్జీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ జగ్గీ అన్నారు.

గుండెపోటు, జ్వరాలతో కొంత మంది అత్యవసర చికిత్సకు హాస్పిటల్స్‌లో చేరినా.. ముఖ్యంగా గుండెపోటు బాధితుల సంఖ్య తగ్గింది.. శ్వాసకోశ, జీర్ణాశయ వ్యాధులు, మద్యం అతిగా సేవించడం వల్లే కలిగే ప్యాంక్రియాసిస్ కేసులు కూడా తగ్గాయి. సామాజిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల న్యుమోనియా లాంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలోని గుండెపోటు రోగులు 40 నుంచి 60% తగ్గారని, అక్యూట్ అపెండిసైటిస్, పిత్తాశయ వ్యాధి లాంటి ఇతర అత్యవసర కేసులు కూడా క్షీణత ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here