ఉమ్మడిగా ఉండలేనన్న తమ్ముడు.. వేరుకాపురం పెట్టలేదని మనస్థాపం.. చివరికి..

అప్పటి వరకూ అన్నతో కలసి ఉన్న తమ్ముడు వేరుకాపురం పెట్టేందుకు రెడీ అయ్యాడు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే భూముల పంపకాల పంచాయితీ ఎంతకీ తేలకపోవడంతో వేరుకాపురం పెట్టుకుందామనుకున్న తమ్ముడి ఆశ నెరవేరలేదు. దీంతో మనస్థాపానికి గురైన తమ్ముడు తన తోటలోనే చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జిల్లాలో జరిగింది.

జిల్లాలోని కబదూర్ మండలం మర్రిమాకులపల్లికి చెందిన గొల్ల నాగరాజు, సాక్షప్ప అన్నదమ్ములు. ఏడాది కిందటే తమ్ముడికి వివాహమైంది. అన్నదమ్ములిద్దరూ ఉమ్మడిగా ఉంటూ తమ భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. అయితే ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడదామని భావించిన తమ్ముడు ఆస్తి పంపకాలు చేయాలని కోరాడు. అయితే భూముల సమస్య ఎంతకీ కొలిక్కిరాలేదు.

Also Read:

వేరుకాపురం పెట్టుకుందామనుకున్న సాక్షప్ప ఆశ నెరవేరలేదు. భూముల పంచాయితీ తేలలేదు. దీంతో మనస్థాపానికి గురైన సాక్షప్ప అఘాయిత్యం చేసుకున్నాడు. తన తోటలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here