రాజధాని ముంబయిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖార్వెస్ట్లోని రోడ్ నంబర్ 10లో ఉన్న పార్క్ విస్టా అనే భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రేమలత సిగ్గా(22) కొద్దికాలం క్రితం వచ్చి ఓ ఇంట్లో పనిమషినిగా చేరింది. అయితే సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆమె భవనం మూడో అంతస్తు నుంచి దూకేసింది. వాచ్మెన్ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read:
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమలత ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె కొంతకాలంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. లాక్డౌన్ కారణంగా నెల రోజులుగా వారు కలుసుకోవడం కుదరలేదు. రోజూ ఫోన్లో మాట్లాడుకునే క్రమంలోనే వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో కొద్దిరోజులుగా ప్రియుడు ఆమెతో మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమలత మొబైల్ ఫోన్ సేకరించిన పోలీసులు కాల్స్డేటా ఆధారంగా కేసును విచారిస్తున్నారు.
Also Read: