యువకుడిని కత్తితో పొడిచి.. కృష్ణా జిల్లాలో దారుణం

పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ప్రత్యర్థి కత్తితో పొడి చేసిన దారుణంగా ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన జరిగింది. చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన పాలపర్తి అలెగ్జాండర్‌(30)ని అదే గ్రామానికి చెందిన నండ్రూ విజయ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచేశాడు.

ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే అలెగ్జాండర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అలెగ్జాండర్‌కి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం ఆంధ్ర హాస్పిటల్‌ కి తీసుకెళ్లారు. పాతగొడవల కారణంగానే దాడి జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here