భారత్‌పై జిహాద్ ప్రకటించండి.. మన దేశ ముస్లింలకు అల్‌ఖైదా పిలుపు

భారత్‌పై ప్రకటించాలని మన దేశ ముస్లింలకు అల్‌ఖైదా పిలుపునిచ్చింది. ముస్లింలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధంలో భారత్ కూడా భాగమేనని అల్‌ఖైదా ఇన్ అరబ్ పెనిన్సులా (ఏక్యూఏపీ) ఆరోపించింది. అంతర్జాతీయంగా ఈ సంస్థపై నిషేధం అమల్లో ఉంది. కశ్మీర్లోని ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేయాలని దాదాపు ఏడాది క్రితం ఈ సంస్థ చీఫ్ అయ్మన్ అల్ జవహరీ కోరారు.

భారత్‌లో ముస్లిం పట్ల అయిష్టత పెరుగుతోందని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, కువైట్ ప్రభుత్వం, ఇతర అరబ్ యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజులకే అల్‌ఖైదా ఈ ప్రకటన చేయడం గమనార్హం. పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్ సమస్యను పదే పదే ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ అరబ్ దేశాలను భారత్‌కు వ్యతిరేకంగా పురిగొల్పే ప్రయత్నం చేస్తోంది. తబ్లీగీ జమాత్ కారణంగా భారత్‌లో ఒక్క కరోనా కేసులు పెరిగిపోగా దీన్ని కూడా భారత్‌పై బురదజల్లడానికి పాక్ ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.

భారత్ సీఏఏకు ఆమోదం తెలపడం పట్ల ఏక్యూఏపీ స్పందిస్తూ.. మోదీ సర్కారు ముస్లింకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది. యెమెన్, సౌదీ అరేబియా దేశాల్లో చురుగ్గా ఉండే ఏక్యూఏపీని ప్రమాదకరమైన అల్‌ఖైదా విభాగంగా అమెరికా పరిగణిస్తుంది.

కశ్మీర్లోని జిహాదీలు భారత్‌పై దాడికి దిగాలని ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ గత ఏడాది వీడియో సందేశం ద్వారా కోరాడు. భారత్‌పై దాడి చేసి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించాలని సూచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here