‘మెదడు, మనసు నాకు శత్రువులు..’ నెల్లూరు యువకుడి ఆత్మహత్య

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలం నిడిగుంటపాళెం గ్రామానికి చెందిన దాచి చైతన్య(21) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తల్లితో కలసి ఊరెళ్లి తిరిగొచ్చిన చైతన్య ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కొద్దిరోజుల ముందు చైతన్య తన తల్లితో కలసి నెల్లూరు రూరల్ మండలం చింతరెడ్డిపాళేనికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు రోజుల కిందట ఒక్కడే తిరిగొచ్చాడు. అతని తల్లి రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె నిడిగుంటపాళెంలోని ఇంటికి తిరిగివచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా చైతన్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాక్‌కి గురై పోలీసులకు సమాచారం అందించింది.

Also Read:

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. చనిపోయే ముందు చైతన్య ఇంటి గోడలపై సూసైడ్‌ నోట్ రాసినట్లు గుర్తించారు. ‘‘ నా చావుకి నేనే కారణం. నా మెదడు, నా మనసు నాకు శత్రువులు. గుడ్‌బై, మీ చైతన్య’’ అని రాసి ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here