మెడకు తాడు బిగించి.. హైదరాబాద్‌లో బీహార్ వ్యక్తి దారుణహత్య

నగరంలో దారుణహత్య జరిగింది. బీహార్‌కు చెందిన వ్యక్తిని కొందరు దుండగులు మెడకు తాడు బిగించి అతికిరాతకంగా చంపేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద కొందరు దుండగులు ఓ వ్యక్తిని తాడుతో మెడకు ఉరి బిగించి అత్యంత కిరాతకంగా చంపేశారు. రైలు పట్టాల పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Also Read:

మృతుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన అజిత్‌గా పోలీసులు గుర్తించారు. అతడు నగర శివారులోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడని, రెండ్రోజులుగా కనిపించడం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చివరికి అతడు విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

అజిత్ హత్య వెనుక కంపెనీ యజమాని హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజిత్ పనిచేసే కంపెనీ యజమానికి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here