మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. కాలినడకన ఊరెళ్తూ స్కూల్లో పడుకున్న పాపానికి..

కారణంగా కాలినడకన సొంతూరికి బయల్దేరిన మహిళ గ్యాంగ్‌రేప్‌‌కి గురైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్‌కి చెందిన మహిళ(40) లాక్‌డౌన్‌కి ముందు సవాయ్ మధోపూర్ జిల్లాకు వెళ్లింది. సడెన్‌గా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయింది. అక్కడే సుమారు నెలరోజులపాటు గడిపిన మహిళ ఎలాగైనా ఇంటికి వెళ్లాలని కాలినడకన బయల్దేరింది.

రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తుండగా చీకటిపడడంతో రహదారి పక్కనే ఉన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విశ్రాంతి తీసుకునేందుకు ఆగింది. మహిళ ఒంటరిగా కనిపించడంతో కామాంధుల కన్ను ఆమెపై పడింది. మహిళను తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

Also Read:

బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. కాలినడకన ఊరికి బయల్దేరిని మహిళపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులను రిషికేష్ మీనా, లఖాన్ రేగర్, కమల్ ఖర్వాల్‌గా గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here