పశువుల మేత కోసం వెళ్లిన బాలికపై దారుణం.. నది ఒడ్డున ఒంటరిగా ఉండడంతో..

పశువుల మేతకోసం నడి ఒడ్డుకు వెళ్లిన బాలికను లాక్కెళ్లి రేప్ చేసిన దారుణ ఘటన యూపీలో జరిగింది. జిల్లా ఘతంపూర్ ప్రాంతానికి చెందని పదేళ్ల బాలిక పశువులకు మేత తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. సమీపంలోని రింధ్ నది ఒడ్డున మేత కోస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు దారుణానికి పాల్పడ్డాడు.

బాలికను లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక తప్పించుకోకుండా గట్టిగా పట్టుకుని పక్కకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మైనర్ బాలికపై మరో మైనర్ అత్యాచారం చేయడం కలకలం రేపింది.

Also Read:

బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఘతంపూర్ పోలీస్ స్టేషన్ సీఐ రవి కుమార్ సింగ్ తెలిపారు. బాలుడిని జువైనెల్ హోమ్‌కి తరలించినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here