కోమాలోకి మాజీ సీఎం అజిత్ జోగి.. పరిస్థితి విషమం

సీ నియర్ నేత, ఛత్తీన్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి (74)ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన కోమాలోకి జారుకున్నట్లు ఆదివారం (మే 10) వైద్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ఆసుపత్రిలో చేర్పించారు. బీపీ పెరగడంతో ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 8 మందితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

తాజాగా అజిత్‌ జోగి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లినట్లు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. శ్వాసవ్యవస్థలో తలెత్తిన ఇబ్బందులతో ఆయన మెదడుకు ఆక్సిజన్‌ అందడం లేదని, దీంతో కోమాలోకి వెళ్లారని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స అనంతరం గుండె పనితీరు మాత్రం సాధారణంగానే ఉందని తెలిపారు.

చికిత్సకు అజిత్ జోగి శరీరం ఎలా స్పందిస్తుందనే విషయం తెలియడానికి మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. జనతా కాంగ్రెస్‌ () పార్టీ అధ్యక్షుడైన అజిత్‌ జోగి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here