కరోనా గుడ్‌న్యూస్‌.. ఢిల్లీలో ప్లాస్మా థెర‌పీ స‌క్సెస్‌

క‌రోనా వైర‌స్‌ను చెక్ పెట్ట‌గ‌ల‌ద‌ని భావిస్తున్న కొన్వ‌ల్‌సెంట్ ప్లాస్మా థెర‌పీ ప్ర‌యోగం భార‌త్‌లో విజ‌యవంతమైంది. తాజాగా ఢిల్లీలో 49 ఏళ్ల ఒక పేషంట్‌కు ఈ విధానంలో చికిత్స అందించ‌గా.. అత‌ను పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. దీంతో క‌రోనాను అడ్డుకునేందుకు ప్లాస్మాథెర‌పీ ఆయుధంలా ప‌నిచేయ‌గ‌ల‌ద‌ని డాక్టర్లు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో థెర‌పీకి సంబంధించిన వివ‌రాల‌ను వైద్యులు వెల్ల‌డించారు.

Must Read:

ఈనెల 4న క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఒక వ్య‌క్తి త‌మ ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. కొన్ని రోజుల‌కు శ్వాస ‌కోశ ఇబ్బందులు ఏర్ప‌డటంతో బ‌య‌ట నుంచి ఆక్సీజ‌న్ స‌పోర్టును ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. రోజురోజుకు ప‌రిస్థితి క్షీణించ‌డంతో ఈనెల 8న వెంటిలెట‌ర్‌ను అమ‌ర్చిన‌ట్లు పేర్కొన్నారు. అయితే రోగి కోలుకోక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల కోరిక మేర‌కు ప్లాస్మా థెర‌పీని వైద్యులు ప్రారంభించారు.

Must Read:

కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వ్య‌క్తి నుంచి ప్లాస్మాను సేక‌రించి ఈనెల 14న రోగికి ఎక్కించారు. ఈ నేప‌థ్యంలో రోజురోజుకు పరిస్థితి మెరుగుప‌డిందని వైద్యలు పేర్కొన్నారు. తాజాగా ఆ రోగిని డిశ్చార్జి చేసిన‌ట్లు తెలిపారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్లాస్మా థెర‌పీ చాలా ఉప‌క‌రించ‌గ‌ల‌ద‌ని పేర్కొంటున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా ఈ థెర‌పీని ఉప‌యోగించేందుకు కేంద్రం ఇప్ప‌టికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు ఇప్పటివ‌ర‌కు 2600కిపైగా న‌మోద‌య్యాయి. 54 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత‌ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here