కరోనాపై అసలు పోరు ఇప్పుడే మొదలు: మోదీ

క రోనా వైరస్ నియంత్రణకు ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఒక ఎత్తని.. ఇకపై తీసుకోబోయే చర్యలు మరో ఎత్తు అని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు అమలు చేసే బాధ్యత అన్ని రాష్ట్రాలపై ఉందన్నారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం (మే 11) ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి సమతుల వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామని పేర్కొన్న మోదీ.. అందరు ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించి వారిచ్చిన సలహాలు, సూచనలు సావదానంగా విన్నారు. కరోనా మహ్మమారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందన్న ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు.

భౌతిక దూరం నియమాలు పాటించని ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. అలాంటి చోట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపులిచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతిపెద్ద సవాల్ అని మోదీ అన్నారు. కరోనాపై అసలు పోరు ఇప్పుడే మొదలైందన్నారు.

Must Read:

3లో ఇచ్చిన సడలింపులతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయని మోదీ గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి తరుణంలో కరోనా కట్టడిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రులకు సూచించారు. ప్రజలు భౌతిక దూరం సహా ఇతర నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం రెండు గజాల దూరం ఉండేలా వారికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రెండు విడతలుగా సుమారు ఆరు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వివిధ అంశాలపై చర్చించారు. ఏప్రిల్‌ 27న జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించే అవకాశం లభించలేదని కొంత మంది ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సోమవారం నాటి సమావేశంలో అందరికీ అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో సాయంత్రం 6 గంటల సమయంలో 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. రాత్రి 9.30 వరకు సమావేశం కొనసాగింది.

ఈ సమావేశంలో ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ముఖ్యమంత్రులు కీలక సూచనలు, అభ్యర్థనలు చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here