ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం… చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు

లాక్‌డౌన్‌లోనూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది. సోమవారం ఆ బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు(23) మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ దుస్తులు విప్పేసి లైంగిక దాడికి యత్నిస్తుండగా బాలిక గట్టిగా కేకలు వేసింది.

Also Read:

దీంతో బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. నిందితుడు బాలికను అక్కడే వదిలేసి పారిపోతుండగా పట్టుకుని చితకబాదారు. అనంతరం చిన్నారి తల్లి గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను రామచంద్రాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here