లేడీ కానిస్టేబుల్‌ని కాల్చిచంపిన హెడ్ కానిస్టేబుల్.! ఆ తరువాత ఏమైందంటే..

మహిళా కానిస్టేబుల్‌ అయిన భార్యను హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చిచంపేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. కారులో లేడీ కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. అతనే భార్యను చంపేసి ఉంటాడని భావించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే హెడ్ కానిస్టేబుల్ కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.

దేశరాజధాని ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ రేణు మాలిక్(34) దారుణ హత్యకు గురైంది. ఎవరో ఆమెను తుపాకీతో కాల్చి చంపేశారు. ఢిల్లీలోని లోధి కాలనీ ఏరియాలో నిలిపి ఉంచిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. రేణుని ఆమె భర్త, హెడ్ కానిస్టేబుల్ మనోజ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు.

Also Read:

భర్త తన సర్వీస్ రివాల్వర్‌తో రేణుని కాల్చి చంపేసి ఉంటాడన్న అనుమానంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే ఊహించని విధంగా మనోజ్ యూపీలో శవమై తేలాడు. జిల్లా దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్‌పూర్‌లో మనోజ్ మృతదేహం లభ్యమైంది. తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో భార్యను హత్య చేసి ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మనోజ్, మహిళా కానిస్టేబుల్ రేణు మాలిక్(34)ని 2010లో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం రేణుని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లైన తరువాత కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. ఇద్దరూ చీటికీమాటికీ గొడవపడుతుండేవారని.. ఈ నేపథ్యంలోనే భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చిన అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here