రంజాన్ వేళ దారుణం… బాంబుదాడిలో 46మంది మృతి

నిత్యం బాంబులతో దద్దరిల్లే సిరియా… మరోసారి దాడితో చిగురటాకులా వణికిపోయింది. సిరియాలోని అఫ్రిన్ లో బాంబుపేలుళ్లు సంభవించాయి. పెట్రోల్ టాంకర్‌ను కొందరు బాంబులతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 46మంది మరణించగా.. 50 మందికి గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సిరియా సివిల్ డిఫెన్స్ వర్కర్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొంది. అవసరమైన సహాయక చర్యలుచేపట్టింది . ఈ దాడిలో టర్కీకి చెందిన కొంతమంది కూడా మరణించి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

మరోవైపు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని అమెరికా ప్రభుత్వం ఖండించింది. పవిత్రమైన రంజాన్ మాసం సమయంలో ఇలా దాడులు చేయడం సరికాదని పేర్కొన్నది. గాయపడిన వ్యక్తులను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రంజాన్ ముస్లింలకు పవిత్రమాసం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లీంలు ఈ సమయంలో కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం పాటిస్తారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్షను విడిచి ఆహారం తీసుకుంటారు. అయితే, ఇలా ఉపవాస దీక్ష విడిచే సమయంలో పెట్రోల్ టాంకర్‌ను బాంబులతో పేల్చారు.

దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ కూడా అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఆఫ్రిన్ పట్టణంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. ఈ దాడికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఒక వీడియోను కూడా పోస్టు చేసింది. ఆ వీడియోలో వరుసగా వెళ్తన్న వాహనాలు మనకు కనిపిస్తాయి. ఆ వాహనాలలో ఒక పెట్రోల్ ట్యాంకర్ కూడా ఉంది. వాహనాలు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ పేలుడు జరిగింది. మరోవైపు ఈ దాడికి కారణమైన వైపీజీ ఉగ్రవాదులను ఉత్తర సిరియా నుంచి వెళ్లగొట్టడానికి సైనిక చర్యలు ప్రారంభమయ్యాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here