మహిళా డాక్టర్ ఆత్మహత్య.. మిర్యాలగూడలో విషాదం

కుటుంబ కలహాలతో ప్రభుత్వ వైద్యుడి భార్య, దంత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పిల్లల వైద్య నిపుణుడు బండారు కుమార్ భార్య శ్వేత ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె దంత వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వారికి తొమ్మదేళ్ల కుమార్తె ఉంది.

కొంతకాలంగా భార్యాభర్తల నడుమ వివాదాలు జరుగుతున్నాయని.. తరచూ గొడవ పడేవారని ఇరుగుపొరుగు చెబుతున్నారు. చనిపోయే ముందు శ్వేత సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తోంది. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ రాసి ఉన్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తనకు భర్తతో జీవితాంతం కలసి బతకాలని ఉన్నా.. భర్త ప్రశాంతంగా లేను అంటున్నాడంటూ వాపోయింది.

తన తొమ్మదేళ్ల కూతురికి సారీ చెబుతూ ఆమె రాసిన నోట్ పలువురిని కలచివేసింది. అత్త దగ్గర ఉండాలంటూ కూతురికి సూచించింది. అలాగే తన పేరుమీద ఆస్తులు ఆమె అత్తకు చెందుతాయని రాసినట్లుగా ఉంది. తన వల్ల ఎవరూ పోట్లాడుకోకూడదని.. కేసులు పెట్టుకోవద్దని కోరింది. చివరగా నాకోసం ఏడ్వొద్దంటూ రాసి పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here