ఫ్లాట్‌లో కుళ్లిన స్థితిలో దంపతుల మృతదేహాలు.. కారణం తెలిసి షాకైన పోలీసులు

రాజధాని అహ్మదాబాద్‌‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య గొంతు కోసి చంపేసిన భర్త తాను ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖత్రాజ్‌లోని ఓ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేసే కలోసనా రాయ్(45) గోటాలోని షయోనా తిలక్‌ అపార్ట్‌మెంట్-3 బ్లాక్‌లో భార్య పరోమిత రాయ్(40)తో కలిసి నివాసముంటున్నాడు. మంగళవారం వారి ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సోలా పీఎస్ ఇన్‌స్పెక్టర్ జె.పి.జడేజా తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Also Read:

వారి మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కలోసనా రాయ్ భార్య గొంతు కోసి, ఆ తర్వాత ఫినాయిల్ తాగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరికి వివాహమై చాలా ఏళ్లు అయినప్పటికీ పిల్లలు కలగలేదని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లల విషయంలో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని బంధువులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా చాలారోజులుగా ఇద్దరూ ఇంట్లోనే ఉంటుండటంతో గొడవలు మరింత ముదిరి చివరకు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here