ప్లీజ్ వెళ్లొద్దు.. వలస కూలీలకు తెలంగాణ, కర్ణాటకలు విజ్ఞ‌ప్తి.. కారణం ఇదే!‌

కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరుగుపయనమవుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు వీరిని తరలించే ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, కూలీలు, కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతే ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తీవ్ర కొరత ఏర్పడుతుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లవద్దని, ఇక్కడే ఉండాలని కోరుతున్నాయి. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

‘కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం త్వరలోనే ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాం.. కూలీలను యాజమాన్యాలు ఆదుకోవాలి.. వారికి జీతాలు చెల్లించాలి.. ఇక్కడే ఉండాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా’అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు.

ఐటీ కాకుండా బెంగళూరులో దాదాపు 8 లక్షల మంది వలస కూలీలు ఉంటారు. వీరిలో దాదాపు 45 నుంచి 50 శాతం మంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారని కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ట్రేడ్ యూనియన్‌లు, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. దీని వల్ల నగర ఆర్ధిక వ్యవస్థ పురోగమనంపై ప్రభావం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే. కూలీలు, కార్మికులను గుర్తించి వారు ఇక్కడే ఉండేలా ఒప్పించాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేసింది.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలు పునః ప్రారంభం కానుండటంతో ఎక్కువ మంది కార్మికులు ఇక్కడ ఉండేందుకు సిద్ధమయ్యారన్నారు. తగినంత ప్రోత్సాహం లేనందున చాలా మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి సిద్దమవుతున్నారని, దాతలపై ఆధారపడటం గౌరవానికి భంగంగా భావిస్తున్నారని బెంగళూరులోని ఏఐటీయూసీ సభ్యుడు సత్య ముకుంద్ వ్యాఖ్యానించారు. తాము పేదవాళ్లమైనా ఉచితంగా వచ్చే ఆహారం తినడానికి సిద్ధంగా లేరన్నారు. ఇలాంటి సమయంలో తమ గ్రామాలే సురక్షితంగా భావిస్తున్నారని తెలిపారు.

మరికొందరు మాత్రం తమ వద్ద పనిచేసే కార్మికులకు జీతాలు, వసతులు కల్పించడంతో సొంతూళ్లకు వెళ్లకుండా ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తమకు చెందిన 12 సైట్స్‌లో దాదాపు 1,800 మంది పనిచేస్తున్నారని, వీరిలో సగం స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారని బెంగళూరులోని హోంబాలే కనస్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ అన్నారు. తమ వద్ద పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించి, సౌకర్యాలు కల్పించడంతో తమ కాలనీలోని 50 శాతం మంది ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టు బ్రిగేడ్ గ్రూప్ ఈడీ రిషిన్ మాథ్యూ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here