యాక్సిడెంట్‌లో ప్రియుడి మరణం.. మర్చిపోలేక బాలిక సూసైడ్.. విశాఖలో విషాదం

ప్రేమించిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో టీనేజ్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది ఏడాది కిందట మరణించిన ప్రియుడిని మర్చిపోలేక మానసికంగా కుంగిపోయిన ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

విశాఖలోని ప్రాంతానికి చెందిన బాలిక(15) అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. ప్రియుడి మరణవార్త తెలిసి ఆమె తీవ్ర వేదనకు గురైంది. డిప్రెషన్‌కి లోనవడంతో మానసిక స్థితి సక్రమంగా లేదని భావించిన తల్లిదండ్రులు మార్పు కోసం బాలికను జోడుగుళ్లపాలెంలోని పిన్ని ఇంటికి పంపించారు.

Read Also:

అయితే ఆమె మానసిక స్థితిలో మార్పు రాలేదు. తీవ్ర కుంగుబాటుకు గురైన బాలిక పిన్ని ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడిని మర్చిపోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here