ప్రాణం తీసిన గొడవ.. భర్తను గుండెల్లో పొడిచి చంపేసిన మహిళ

క్షణికావేశంలో ఓ మహిళ కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి చంపిన ఘటన రాజధాని చెన్నైలో వెలుగుచూసింది. కుమారుడికి ఆహారం తినిపించే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో భార్య కత్తితో భర్తను పొడిచింది. జార్ఖండ్‌‌కు చెందిన అఖిలేష్‌ కుమార్‌(36) చెన్నైలోని రాణిపేట సమీపంలోని బెల్‌ సంస్థలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ భార్య అఖిల కుమారి(27), కొడుకు(5), తల్లి సావిత్రి దేవితో కలిసి ఉంటున్నాడు.

Also Read:

కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కుమారుడికి ఆహారం తినిపించే విషయం దంపతుల మధ్య గొడవ జరిగి తారాస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన అఖిల కిచెన్‌లో నుంచి కత్తి తెచ్చి భర్తను గుండెల్లో పొడిచింది. అతడు కేకలతో స్పందించిన స్థానికులు వెంటనే బెల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడిని రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అఖిల కుమారిని అరెస్టు చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here