పీఓకేలో ఎన్నికలకు పాక్ సుప్రీంకోర్టు అనుమతి… తమ భూభాగం వదలివెళ్లాలని భారత్ అల్టిమేటం!

ప్రాంతంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గిల్గిత్-బాల్టిస్థాన్ సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం భారత్‌లో అంతర్భాగమని, ఆక్రమించుకున్న భూభాగం నుంచి తక్షణమే వైదొలగాలని పాకిస్థాన్‌కు విదేశాంగ శాఖ అల్టిమేటం జారీచేసింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌లో సాధారణ ఎన్నికల నిర్వహణకు అక్కడ ప్రభుత్వం 2018లో చేసిన సవరణకు పాక్ సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది. ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఆ ప్రాంతం కూడా తమదేనని స్పష్టం చేసింది.

‘గిల్గిత్-బాల్టిస్థాన్‌ను ప్రత్యేక ప్రాంతంగా పేర్కొంటూ పాక్ సుప్రీంకోర్టు ఉత్తర్వులపై తీవ్ర నిరసన తెలిపిన భారత్.. పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తను నిలదీసింది. గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతం సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఒక అంతర్భాగం.. దీనిపై పూర్తిస్థాయి చట్టబద్ధమైన అధికారులు తమవేనని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి, దాని న్యాయవ్యవస్థకు చట్టవిరుద్ధమైన, బలవంతంగా ఆక్రమించుకునన భూభాగాలపై ఎలాంటి అధికారం లేదని విదేశాంగ శాఖ ఉద్ఘాటించింది.

ఇలాంటి చర్యలను భారత్ పూర్తిగా తిరస్కరిస్తుందని, జమ్మూ కశ్మీర్ భూభాగంలోని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భౌతిక మార్పులకు నిరంతరం పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. కాబట్టి, తమ భూభాగం నుంచి పాకిస్థాన్ తక్షణమే వైదొలగాలని హెచ్చరించింది. గత ఏడు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ఆక్రమించుకున్న భూభాగాలలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దోపిడీ, స్వేచ్ఛ హరించే చర్యలకు పాల్పడుతోందని, వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోందని భారత్ దుయ్యబట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here