త్వరగా కరోనాకు వ్యాక్సిన్ రావాలంటే అదొక్కటే మార్గం.. డబ్ల్యూహెచ్‌ఓ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆరోగ్యవంతులైన వలంటీర్లకు కోవిడ్ -19కు కారణమయ్యే వైరస్ ఉద్దేశపూర్వకంగా సోకడం వల్ల ప్రాణాంతక వ్యాధికి వ్యాక్సిన్ల అధ్యయనాలను వేగవంతం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించారు. గణనీయమైన ముప్పు కలిగి ఉన్న ఇటువంటి అధ్యయనాలు విపత్కర పరిస్థితులలో రక్షణగా నిలుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధికి ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నారు. మరోవైపు, మహమ్మారి వల్ల కుంటిపడిన ఆర్ధిక వ్యవస్థను పునఃనిర్మించడానికి దేశాలు నడుం బిగించాయి. ప్రస్తుతం టీకాపై జరుగుతున్న అధ్యయనాల్లో వలంటీర్లకు నేరుగా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సిన్ల తయారీ వేగవంతం చేయవచ్చు. ఇది ఓ రకంగా క్లిష్టమైన విధానమే కానీ, వ్యాక్సిన్ తొందరగా అందుబాటులోకి వస్తుంది.

వర్కింగ్ గ్రూప్ పేపర్ ప్రకారం.. సవాళ్లతో కూడిన ఈ అధ్యయనాలు క్షేత్రస్థాయి పరీక్షల కంటే చాలా వేగంగా సాగుతాయి.. ఎందుకంటే, ఇందులో తక్కువ సంఖ్యలో వలంటీర్లు పాల్గొంటారు కాబట్టి సమర్థత, భద్రతను అందజేయడానికి అవకాశం ఉంది. శాస్త్రీయ సమర్ధన, సంభావ్యత అంచనా, విషయ సమాచారం, సమ్మతి తదితర ఎనిమిది అంశాలను ఈ అధ్యయనంలో కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నివేదిక పేర్కొంది.

సవాళ్లతో కూడుకున్న ఇలాంటి అధ్యయనాల వల్ల మరణాలు ప్రపంచవ్యాప్తంగా అదుపులో ఉంచుతాయి.. కానీ, దీని వల్ల వలంటీర్లు, శాస్త్రవేత్తలకు ముప్పు అధికంగా ఉంటుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ మార్క్ లిప్‌స్టిచ్ వ్యాఖ్యానించారు. సహజంగానే ఈ లైవ్ వైరస్ ఉన్న వలంటీర్లకు తీవ్రమైన వ్యాధి, కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుందని జర్నల్ ఆఫ్ ఇన్‌ఫక్టియస్ డిసీజెస్‌లో మార్చిలో ప్రచురించిన ఆర్టికల్‌లో తెలిపారు.

వాస్తవానికి వాక్సిన్‌లను పెద్ద సమూహాలలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ ఫలితాలను వ్యాక్సిన్ ఇవ్వని సమూహాలతో పోల్చిచూస్తారు. వారి రోజువారీ జీవితంలో రెండు గ్రూపులు అనారోగ్యానికి గురికావడం, వ్యాక్సిన్ ప్రయోగానికి కొన్ని నెలలు పడుతుంది. అయితే ఛాలెంజ్ స్టడీస్ వెంటనే వైరస్‌కు గురయ్యేలా చేస్తుంది. సాధారణంగా యువకులు, వ్యాధి ముప్పు తక్కువ కలిగిన ఆరోగ్యవంతులైన వలంటీర్లు పర్యవేక్షించబడతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఛాలెజింగ్ స్టడీస్ గురించి మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ టాల్ జాక్స్ బుధవారం ఆరోగ్య వార్తా సంస్థ స్టాట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆచరణాత్మక, నైతికతకు తాను పెద్ద అభిమానిని అని వ్యాఖ్యానించారు. ఛాలెంజ్ స్టడీ రూపకల్పన, అమలుకు నెలలు పట్టే అవకాశం ఉందని, వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని, మూడు దశల అధ్యయనంలో ఇప్పటికే రెండవ దశలో ప్రవేశించిందన్నారు. తేలికపాటి ఇన్‌ఫెక్షన్లకే కాదు, వ్యాధిని నిరోధించాల్సి ఉంటుందని, ఎంచుకున్న మోతాదు సరైందేనా అని తెలుసుకోవడం కష్టమన్నారు. పలు దేశాల్లో క్లినికల్ ట్రయల్ ప్రారంభం కాగా.. మొత్తం 102 దేశాల్లో దాదాపు 14,000 మంది వలంటీర్ల ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here