ట్రాక్టర్‌ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడిన కారు.. మహిళ మృతి.. నెల్లూరులో విషాదం

కుమార్తె గర్భిణి కావడంతో చేదోడువాదోడుగా ఉండేందుకు వచ్చిన తల్లి ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌‌ కారణంగా కూతురి ఇంటి వద్దే చిక్కుకుపోయిన దంపతులు సొంతూరు వెళ్లేందుకు కారులో బయల్దేరారు. కొద్దిసేపటికే ప్రమాదవశాత్తూ కారు ట్రాక్టర్‌ని ఢీకొని ఎగిరిపడడంతో భార్య ప్రాణాలు కోల్పోయింది.

నగరంలోని సంగడిగుంట ప్రాంతానికి చెందిన మురళీకృష్ణ, ఇందిరాదేవిల కుమార్తె నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నివాసం ఉంటారు. కూతురు గర్భిణి కావడంతో ఆమెకు పనుల్లో సాయంగా ఉండేందుకు ఇందిరాదేవి రెండు నెలల కిందట వచ్చారు. కొద్దిరోజుల తర్వాత ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు భర్త మురళీకృష్ణ మార్చి 21న కూతురి ఇంటికి వచ్చారు.

Also Read:

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో నాయుడుపేటలోనే ఉండిపోయారు. అప్పటికే నెల రోజులకు పైగా గడచిపోవడంతో ఎలాగైనా గుంటూరు వెళ్లాలని భావించారు. గుంటూరు నుంచి ఓ కారు చెన్నై వెళ్లి వస్తోందని తెలుసుకుని తెల్లవారుజామున మురళీకృష్ణ దంపతులు ఆ కారులో గుంటూరు బయలుదేరారు.

నెల్లూరు ఎన్టీఆర్ నగర్ దాటిన తరువాత జాతీయ రహదారిపై కారు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ని ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొట్టి అమాంతం గాల్లోకి ఎగిరిపడింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఇందిరాదేవికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here