టిక్కెట్ బుకింగ్స్‌పై రైల్వే శాఖ మార్గదర్శకాలు.. ఈ షరతులు వర్తిస్తాయి

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ‌ను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. నడపాలన్న కేంద్రం ఆదేశాలతో మంగళవారం నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నుంచి దేశంలోని 15 నగరాల మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీలనే.. ీ ప్రత్యేక రైళ్లకు కూడా వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ మేనేజర్లు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని స్టేషన్లలో రైలు ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్థానికంగా ప్రచారం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించింది. ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్‌కు అనుమతిలేదని స్పష్టం చేసింది. వారం రోజుల ముందుస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని, కేవలం కన్మార్ఫ్ టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టికెట్లు ఉండవు.

ఆన్‌లైన్లో మాత్రమే టికెట్లను రద్దుచేసుకునే అవకాశం కల్పించింది. టికెట్‌ను 24 గంటల ముందుగా రద్దు చేసుకోవాలి. 50 శాతం రుసుము మాత్రమే తిరిగి చెల్లిస్తారు. రైళ్లలో ప్రయాణికులకు ఆహారాన్ని ఐఆర్‌సీటీసీయే సరఫరా చేయనుంది. టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఐఆర్‌సీటీసీలో ఆహారం బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రయాణికులకు దుప్పట్లు, టవల్స్ సరఫరాను ప్రత్యేక రైళ్లలో ఇవ్వడం లేదు.

ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భుబనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై తిరువనంతపురం, మెడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా పిలవనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here