గుజరాత్‌లో కరోనా బీభత్సం.. ఒక్క రోజే 20 మంది మృతి

గు జరాత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనాతో 20 మంది మరణించారు. అహ్మదాబాద్‌ నగరంలోనే 19 మంది మరణించడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో మొత్తం 347 కరోనా కేసులు నమోదు కాగా.. 20 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనాతో సోమవారం (మే 11) నాటికి 513 మంది మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 8542కు చేరింది. అటు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 వేల మార్క్ దాటింది.

అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 6086కు చేరింది. గుజరాత్‌లో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2780 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు తమిళనాడులోనూ కరోనా కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here