పెళ్లి పేరుతో యువతిపై లైంగిక దాడి.. అబార్షన్ చేయించి ప్రియుడి పరార్

ప్రేమ పేరుతో యువతి వెంట తిరిగి, పెళ్లి చేసుకుంటానని మాయమాయలు చెప్పి ఆమెను లైంగికంగా దోచుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:

జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన పాలెపు ప్రవీణ్ అనే యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన ప్రవీణ్ శారీరకంగా అనుభవించాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. అయితే గర్భంతో ఉండగా పెళ్లి చేసుకుంటే అందరిలోనూ పరువు పోతుందని, అబార్షన్ చేయించుకుంటే వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ ఆమెకు నమ్మబలికాడు. అతడి మాటలకు ఆమె సరే అనడంతో ఈ నెల 5న రామన్నపేటకు చెందిన లేడీ డాక్టర్‌ విజయ సాయంతో అబార్షన్ చేయించాడు.

Also Read:

ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా ప్రవీణ్ మాట మార్చేశాడు. ఆమెకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని యువతి గ్రహించిన యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఆరా తీసిన పోలీసులు ప్రవీణ్‌తో పాటు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసిన డాక్టర్‌ విజయపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here