గిర్ అడవుల్లో మరోసారి కలకలం.. 23 సింహాలు మృత్యువువాత

ఆసియా సింహాల సంతతికి పుట్టినిల్లు అయిన గుజరాత్‌లోని గిర్‌ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మృత్యువు విలయతాండవం చేస్తోంది. గత మూడు నెలల్లో 23 సింహాలు ఇక్కడ మృత్యువాత పడ్డాయి. ప్రొటోజొవా పారాసైట్‌ కారణంగా వచ్చే బబేసియా మృగరాజులను కబళిస్తోందని జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ తెలిపారు. బ్లడ్ ప్రోటోజోవా పారాసైట్‌ను బబేసియా అని పిలుస్తారని, ఇది కొన్ని విషపురుగులు, కీటకాల కుట్టడం ద్వారా వస్తుందని, అంటువ్యాధి కాదు.. దీనికి చికిత్స ఉందని తెలిపారు. జాతీయ పార్క్‌లోని చిన్న ప్రాంతంలో పెద్ద సింహాలన్నీ చనిపోయాయని, వ్యాధి బారిపడ్డ ఒక జంతువును తినడం వల్లే వీటికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని అన్నారు.

అలాగే పలు సింహాలు తమలో తాము కలహించుకుని, మునిగిపోయి, వృద్ధాప్యం, పాము కాట్లతో చనిపోయాయని వాసుదేవ పేర్కొన్నారు. సింహాల మరణంపై దర్యాప్తు కొనసాగుతోందని, నివేదికను తర్వలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. బబేసియా సోకిన మరో 18 సింహాలకు చికిత్స అందజేస్తున్నారు. జసాధర్ జంతు చికిత్స కేంద్రం వీటికి చికిత్స చేస్తోంది.

వైరస్, ప్రోటోజావా పారసైట్ కారణంగా దాదాపు రెండు డజన్ల సింహాలు మృత్యువాతపడ్డాయని తర్వాత అమెరికా నుంచి కానైన్ డిస్టెంపర్ వైరస్ (సిడివి) వ్యాక్సిన్‌ను అటవీ శాఖ దిగుమతి చేసుకుని, గిర్ అడవిలోని అన్ని సింహాలకు వాటిని వేసిందని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 2018లో గిర్ నేషనల్ పార్క్‌లో కానైన్ డిస్టెంపర్ వైరస్‌తో చనిపోయాడు. సింహ శరీరంలో రక్తహీనతకు కారణమయ్యే ఎర్రరక్త కణాలపై బేబీసియా ప్రోటోజోవా దాడిచేసి సీడీవీ లాంటి ఇతర వ్యాధుల బారిన పడేలా చేస్తుందని ఒక అధికారి తెలిపారు.

గి ర్ అరణ్యంలో ఆఫ్రికా సింహాల తర్వాత అంతటి గుర్తింపు పొందిన ఆసియా సింహాలకు ఆపద రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here