కేరళలో మరోసారి సున్నా కేసులు..

కే రళలో వరసగా రెండో రోజు కొత్త కేసులు నమోదు కాలేదు. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు రోజులు ‘0’ కేసులు నమోదవడం గమనార్హం. మంగళవారం మాత్రమే కొత్తగా 3 కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గురువారం (మే 7) కొత్త కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది. గురువారం 56 ప్రాంతాలను హాట్‌స్పాట్ జాబితాలో నుంచి తొలగించినట్లు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు.

కేరళలో ప్రస్తుతం మొత్తం 30 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బుధవారం మరో ఏడుగురు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 93.42 శాతం కావడం విశేషం.

కేరళలో రికవరీ రేటు పెరుగుతుండటం శుభసూచకం. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కేరళలో మొత్తం 21,342 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో 21,034 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న కేరళ వాసులను 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

Also Read:

భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంది. కేరళలో కరోనా కారణంగా నలుగురు మరణించారు. వీరిలో నాలుగు నెలల ఓ చిన్నారి కూడా ఉంది.

మరోవైపు.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విదేశాల నుంచి తొలి విమానం భారత్‌కు చేరుకుంది. 177 మందితో అబుదాబి నుంచి వచ్చిన ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో ల్యాండ్ అయింది. వీరిలో 49 మంది గర్భిణులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరందరూ తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.

అటు సముద్ర సేతు ఆపరేషన్‌లో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీ చేరుకున్న తొలి నౌక తిరిగి పయనమైంది. ఇండియన్ నేవీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ యుద్ధనౌక 1000 మంది ప్రయాణికులను తీసుకొని శుక్రవారం సాయంత్రానికి కోచి తీరం చేరుకోనుంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here