ఓ వైపు కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తుంటే.. సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పారామిలిటరీ దళాలపై కాల్పులకు తెగబడటంతో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల దాడిలో మరి కొంత మంది జవాన్లు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారాలో సోమవారం (మే 4) ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాద ఏరివేత చర్యల్లో భాగంగా కూంబింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ బెటాలియన్పై సాయుధులైన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. హంద్వారా సెక్టార్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కల్నల్ అశుతోష్ శర్మ సహా ఐదుగురు జవాన్ల అమరులైన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మళ్లీ అలాంటి దుర్ఘటనే జరిగింది.
Also Read: