కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: కరోనా మరణాలకు కాలుష్యంతో సంబంధం

⍟ దేశంలో మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,755 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే మరో 778 మంది వైరస్ బారినపడ్డారు.

⍟ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో 14 నుంచి 28 రోజుల వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే లక్షణాలు ఉంటే బయటపడతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉంటే వ్యాధిని తర్వగా కోలుకుంటారు. ఒకవేళ ఇతర అనారోగ్య కారణాలు ఉంటే వారిలో వైరస్ తగ్గడానికి కొంత సమయం పడుతుంది. అయితే, కేరళకు చెందిన ఓ మహిళకు మాత్రం కరోనా వైరస్ నిర్ధారణ అయిన 42 రోజుల వరకూ మహమ్మారి నుంచి ఊరట లభించలేదు.

⍟ కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది.

జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 195కు చేరింది. అయితే వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా సోకడం కలకలంరేపింది.

వల్ల

వ్యాప్తి చెందే అవకాశం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది. శృంగారం వల్ల కొవిడ్-19 వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు తేల్చారు. వీర్యం, వృషణాల్లో కరోనా వైరస్ ఉన్నట్లుగా తాము జరిపిన పరిశోధనలో ఆధారాలు లభించలేదని వారు వెల్లడించారు.

⍟ దేశంలో

కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుల వయసున్న పసికందుల నుంచి 80 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు ఈ మమహ్మారి బారిన పడుతున్నారు. కాగా ఉత్తరాఖండ్‌లో 9 నెలల వయసున్న ఓ శిశువు కరోనాను జయించాడు. ఆ బాబును ఏప్రిల్ 17న డూన్ హాస్పిటల్‌లో చేర్పించగా.. గురువారం డిశ్చార్జ్ చేశారు.

⍟ క‌రోనా వైర‌స్ మందుకు సంబంధించి తొలి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్ ఫెయిలైంది. గిలీడ్ సైన్సైస్ అనే సంస్థ యాంటివైర‌ల్ రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను అభివృద్ధి చేసి తాజాగా ప‌రీక్షించింది. చైనాలో ప‌రీక్షించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్‌లో రోగుల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

⍟ కరోనా వైరస్ బాధితుల మరణాలకు వాతావరణ కాలుష్యానికి సంబంధం ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లో ఎక్కువ మరణాలు సంభవించిన ప్రాంతాల వాతావరణంలో నైట్రోజన్‌ డయాక్సైడ్‌ స్థాయి అధికంగా ఉండడంతోపాటు అక్కడ గాలులు తక్కువ వేగంతో వీస్తుండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఉత్తర ఇటలీ, చైనాలోని హుబే ప్రావిన్స్‌ల చుట్టూ పర్వతాలు విస్తరించి ఉన్నాయి… దాంతో ఇక్కడ గాలి స్థిరంగా ఉండిపోతుంది. అలాగే వాతావరణంలోనూ నైట్రోజన్‌ డయాక్సైడ్‌ అధికంగా ఉంది’ అని పరిశోధకుడు యారాన్‌ ఓజెన్‌ తెలిపారు.

⍟ భారత దేశంలో కరోనా కట్టడికి ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొవిడ్-19ను సమర్థంగానే ఎదుర్కొంటోందని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓ సర్వే ప్రకారం ఇది వెల్లడైంది.

⍟ చిత్తూరు జిల్లాను కరోనా వణికిస్తోంది.. జిల్లాలో 73 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శ్రీకాహస్తిలో ఉన్నాయి. గురువారం విడుదలైన బులిటెన్‌లో చిత్తూరు జిల్లాలో 14మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన బాంబ్‌ డిస్పోజబుల్‌ స్క్వాడ్‌ ఏఎస్‌ఐతో పాటు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

⍟ భారత ఆర్మీలో పని చేస్తున్న జనగామకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఇతను గత కొంత కాలం క్రితమే ఢిల్లీ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. నెల రోజుల క్రితం కరీంనగర్‌లో పర్యటించిన పది మంది ఇండోనేసియన్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వారు రామగుండానికి వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఈ జవాను కూడా వచ్చినట్లుగా సమాచారం.

⍟ తెలంగాణలో గత 24 గంటల్లో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వీటిలో 13 కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కాగా, 10 కేసులు జోగులాంబ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. మొత్తం కేసుల సంఖ్య 970కి చేరిందన్నారు.

⍟ మహారాష్ట్ర మంత్రి ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయనను ముంబయిలోని ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు- పర్యాటక వీసాలపై మన దేశానికి వచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో తబ్లీగీ సమ్మేళనానికి హాజరయ్యారంటూ 13 మంది బంగ్లాదేశీయుల్ని, ఎనిమిది మంది మలేసియా పౌరుల్ని థాణె నేర విభాగ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల క్వారంటైన్‌ గడువు ముగిశాక ఈ పరిణామం చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here