తెలంగాణలో రౌడీషీటర్ దారుణహత్య.. తలని వేరుచేసి అత్యంత కిరాతకంగా

లాక్‌డౌన్ సమయంలో నేరాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని పోలీసులు చెబుతుంటే నేరస్థులు మాత్రం రెచ్చిపోతున్నారు. కొద్దిరోజులుగా హత్యలు, అత్యాచారాలు, దాడులు లేకుండా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నేరాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే రోజు వ్యవధిలోనే రెండు అత్యాచార ఘటనలు నమోదు కాగా.. జిల్లాలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని తలను వేరు చేసి అతికిరాతకంగా చంపేశారు.

Also Read:

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహాన్ని దారుణ స్థితిలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామానికి చెందిన అంబటి ఎల్లంగౌడ్‌గా గుర్తించారు. అతడిపై గతంలోనే అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. 2014లో శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ చౌరస్తా సమీపంలోని బావర్చి హోటల్ వద్ద ఎల్లంగౌడ్ గ్యాంగ్ పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా సళంత్రి‌కి చెందిన ఈశ్వర్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఎల్లంగౌడ్‌పై కర్ణాటక, మహారాష్ట్రలోనూ అనేక కేసులున్నట్లు తెలుస్తోంది.

Also Read:

వెంకట్ గ్యాంగ్ పనేనా?

అనేక హత్యలు, సెటిల్‌మెంట్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎల్లంగౌడ్‌కు శత్రవులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ప్రధానంగా వెంకట్‌ గ్యాంగ్‌తో అతడిని డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అతడిపై హత్యాయత్నం జరగ్గా తప్పించుకున్నాడు. మూడోసారి మాత్రం ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడి తలను మొండెం నుంచి వేరు చేయడంతో ఘటనా స్థలం వద్ద పరిస్థితి భీతావాహంగా ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here