కరోనా ‘మహా’ విలయం.. ముంబైలో 5వేలు దాటిన పాజిటివ్ కేసులు

ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ మ‌హారాష్ట్రను వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తం‌గా అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్‌, క‌రోనా మ‌ర‌ణాలు ఈ రాష్ట్రంలోనే న‌మోదవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ముంబైలో ప‌రిస్థితి ఘోరంగా ఉంది. శ‌నివారం ఒక్క‌రోజే 602 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5000 మార్కును దాటింది. ఓవ‌రాల్‌గా పాజిటివ్ కేసులు 5,059గా న‌మోద‌య్యాయి. మ‌రోవైపు శ‌నివారం 13 మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 191కి చేరింది.

Must Read:

ఇక మ‌హారాష్ట్ర వ్యాప్తంగా శ‌నివారం మొత్తం 811 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,628కు చేరింది. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా శ‌నివారం 22 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 323కు చేరుకుంది.

Must Read:

మ‌ర‌ణించిన వారిలో మ‌హారాష్ట్ర‌కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చంద్ర‌కాత్ గ‌ణ‌ప‌త్ పెందుర్కార్ ఉన్నారు. గ‌త కొద్ది రోజులుగా క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్న ఆయ‌న‌.. తాజాగా ప్రాణాలు విడిచారు. ఆయ‌న స్థానిక వ‌కోలా పోలీస్ స్టేష‌న్‌లో ప‌నిచేసేవారు. ఆయ‌న మృతిపై రాష్ట్ర పోలీస్ శాఖ సంతాపం తెలిపింది. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,200 దాటింది. ఇప్ప‌టివ‌ర‌కు 820 మందికిపైగా మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here