హ్యాట్యాఫ్ దేబీప్ర‌సాద్‌.. క‌రోనా సాయానికి అరుదైన నాణేల వేలం

ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాడుతున్న కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఇప్ప‌టికే మ‌ద్ద‌తుగా చాలామంది నిలిచారు. త‌మ‌కు తోచిన రీతిలో ఆర్థికసాయాన్ని ప్ర‌క‌టించారు. తాజాగా ఒడిశాకు చెందిన దేబీప్ర‌సాద్ మంగ‌రాజ్ అనే అరుదైన కాయిన్ల‌ను సేక‌రించే వ్య‌క్తి వినూత్న‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ద‌గ్గ‌రున్న అరుదైన కాయిన్లను వేలం వేసి, ఆ డ‌బ్బును కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల రిలీఫ్ ఫండ్‌కు జ‌మ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ఆశోక చ‌క్ర‌వ‌ర్తి కాలం నుంచి బ్రిటిష్ కాలం వ‌ర‌కు గ‌ల అరుదైన కాయిన్లు ఉన్నాయి.

Must Read:

దేబిప్ర‌సాద్ గ‌త 20 ఏళ్లుగా ఈ కాయిన్ల‌ను సేక‌రిస్తున్నారు. నిజానికి ఇన్నాళ్లుగా త‌న‌కు కాయిన్ల‌ను అమ్మాల‌ని ఆలోచన ఎప్పుడూ రాలేద‌ని, ఈ సంక్షోభ కాలంలో కాయిన్ల‌ను వేలం వేసి ఆ నిధులను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని స‌న్నిహితులు సూచించ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు దేబి ప్రాసాద్ తెలిపారు.

Must Read:

దేబి ప్ర‌సాద్ ద‌గ్గ‌ర అశోక చ‌క్ర‌వ‌ర్తి, చంద్ర‌గుప్త మౌర్యుడు, గుప్తుల సామ్ర‌జ్యం, శివాజీ సామ్రాజ్యం, బ్రిటిష్ ఎంప‌ర‌ర్‌కు సంబంధించిన నాణాలే కాకుండా.. అమెరికా, యూకే, హాంకాంగ్‌, బెల్జియం, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, నేపాల్‌కు చెందిన దేశాల నాణేలు కూడా ఉన్నాయి. ఈ వేలం వ‌చ్చేనెల‌లో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here