కప్పు కాఫీ ఇవ్వలేదని పైశాచికం.. భార్య ఒంటిపై వేడినీళ్లు పోసి..

లాక్‌డౌన్‌తో మహిళలపై గృహ హింస పెరిగిపోతోంది. సరైన కూర వండలేదని.. ఇళ్లు శుభ్రంగా లేదని వంకలు పెడుతూ భర్తలు వేధించుకు తింటున్నారంటూ పోలీస్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయిస్తున్న భార్యల సంఖ్య పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. తాజాగా కప్పు ఇవ్వనందుకు ఒంటిపై వేడినీళ్లు పోసి భర్త కాల్చేశాడంటూ భార్య పోలీస్ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

నగరంలోని దొడ్డబళ్లాపురకి చెందిన స్క్రాప్ డీలర్ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం కాఫీ ఇవ్వాలని భార్యని అడిగాడు. తాను వంట గదిలో బిజీగా ఉన్నానని.. ఇప్పుడు కాఫీ ఇవ్వడం కుదరదని భార్య సమాధానమిచ్చింది. పనిమనిషి కూడా రావడం లేదని.. అన్ని పనులు తానే చేసుకోవాల్సి వస్తోందని వాపోయింది. ఈ టైంలో కాఫీ పెట్టి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

Also Read:

దీంతో ఆగ్రహం చెందిన భర్త ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యమధ్య మాటామాటా పెరిగి వివాదం ముదిరింది. కోపంతో ఊగిపోయిన భర్త గ్యాస్ స్టౌపై మరుగుతున్న వేడినీళ్లను అమాంతం భార్యపై పోసేశాడు. ఒంటిపై వేడినీళ్లు పోయడంతో శరీరం కాలిపోయింది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వచ్చి కాలిన గాయాలకు ప్రాథమిక చికిత్స చేశారు.

అనంతరం ఆమె పోలీస్ హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. కాఫీ ఇవ్వడం కుదరదని చెప్పినందుకు ఒంటిపై వేడినీళ్లు పోసి తన భర్త కాల్చేశాడని చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇరవై శాతం కాలిన గాయాలయ్యాయని.. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. వేడినీళ్లు పోసిన భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here