ఎయిరిండియాలో కలకలం.. ఐదుగురు పైలట్లకు కరోనా పాజిటివ్

ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఐదుగురు పైలట్లు ఇటీవల గ్యాంగ్జూకు వెళ్లిన కార్గో విమానం నడిపినట్టు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ విధించిన తర్వాత అంతర్జాతీయ గమ్యస్థానాలకు కార్గో విమాలను నడుపుతోంది. గ్యాంగ్జూ నుంచి ఢిల్లీకి బోయింగ్ 787 విమానాలు ద్వారా ఏప్రిల్ 18న వైద్య సామాగ్రిని తరలించారు. దీంతోపాటు షాంఘై, హాంకాంగ్‌లకు ఎయిరిండియా సర్వీసులు నడిచాయి. అయితే, తమ సిబ్బందికి కరోనా సోకినట్టు ఎయిరిండియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

‘పైలట్లకు కరోనా సోకినట్టు తెలియడంతో ప్రస్తుతం స్వదేశానికి తిరిగి పంపే విమానాల విషయమైన ఆందోళన నెలకుంది.. వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న న్యూయార్క్ లాంటి ప్రాంతాలకు విమానాలు వెళ్లాయి’అని ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. స్వదేశానికి భారతీయులను తీసుకొచ్చే విమానాల్లోని సిబ్బందికి బయలుదేరడానికి ముందు, గమ్యస్థానం చేరిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. సిబ్బంది నుంచి నమూనాలు సేకరించిన తర్వాత.. ఫలితాలు రావడానికి 24 నుంచి 48 గంటలు పడుతుంది. ఈ సమయంలో వారికి హోటల్‌లో వసతి ఏర్పాటుచేస్తారు. ఒకవేళ నెగెటివ్ వస్తే, విమానం బయలుదేరడానికి అనుమతిస్తారు. వారు స్వదేశానికి వచ్చిన ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేపడతారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ వస్తే వారిలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించుకుంటారు. తర్వాతే విధులకు అనుమతిస్తారు.

ప్రీ-ఫ్లైట్ కోవిడ్ పరీక్ష అవసరం ఏంటంటే, బయలుదేరిన ఐదు రోజులలోపు నమూనాా సేకరించబడి, నెగెటివ్ రావాలి. విదేశాల నుంచి తరలించే భారతీయుల కోసం పంపే విమానాల్లోని తన ఉద్యోగుల రక్షణకు ఎయిరిండియా తగిన చర్యలు తీసుకుంటుంది. హజ్మత్ సూట్స్, గ్లోవ్స్, మాస్క్, గాగుల్స్ సహా పీపీఈ కిట్‌లను అందజేస్తుంది.

ఇంతకు ముందు ఎయిర్ ఇండియా నిర్వహించిన ఆపరేషన్‌లకు భిన్నంగా ప్రస్తుతం వందే భారత్ సాగుతోంది. స్వదేశానికి తిరిగి వచ్చే విమానాలు న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, లండన్, సింగపూర్ వంటి నగరాల్లో సిబ్బందికి రాత్రిపూట బస ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ నుంచి తిరిగొచ్చేవరకూ ఆహారం సహా అన్ని సౌకర్యాలనూ కల్పిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here