ఇకపై పారామిలటరీ క్యాంటీన్‌లలో స్వదేశీ వస్తువులు మాత్రమే.. ఎప్పుటి నుంచి అంటే?

పారామిలటరీ క్యాంటీన్‌లలో కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే జూన్ 1 నుంచి విక్రయించునున్నట్టు ప్రభుత్వం కీలక ప్రకనం చేసింది. ప్రధాని మోదీ‘ఆత్మ నిర్భర్ భారత్’నినాదం ఇచ్చిన మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రధాని మంత్రి నరేంద్ర ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై సెంట్రల్‌ ఆర్మడ్ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) క్యాంటీన్లలో స్థానిక ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. జూన్‌ 1 నుంచి ఈ మార్పును అమలు చేస్తామని హోం శాఖ ప్రకటించింది.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సిఎపిఎఫ్) క్యాంటీన్లు స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇది జూన్ 1 నుంచి వర్తిస్తుంది. సుమారు 10 లక్షల మంది సిఏపీఎఫ్ సిబ్బంది, వారి కుటుంబంలోని 50 లక్షల మంది సభ్యులు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు’ అని ట్వీట్ చేశారు.

సీఆర్ఫీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమ బల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అసోం రైఫిల్స్ సీఏపీఎఫ్ దళాలకు చెందిన పారా మిలటరీ క్యాంటీన్‌లలో ఏడాదికి రూ.2,800 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. సాధారణ ప్రజలు కూడా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని కేంద్ర హోం హంత్రి కోరారు.

ఇది వెనుకంజ వేయడానికి సమయం కాదు, సంక్షోభాన్ని అవకాశంగా మార్చకోవాలన్నారు. ప్రతి భారతీయుడు భారతదేశ ఉత్పత్తులలో మాత్రమే ఉపయోగించాలని సంకల్పిస్తే, దేశం స్వావలంబన అవుతుందని కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ రూ.20 లక్షల కోట్లతో ప్రధాని మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి అర్థమైందని.. ఇక భవిష్యత్తు అంతా మనదేనని మోదీ పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో ఐదు పిల్లర్లే భారత్‌ను నిలబెడతాయని అన్నారు. ఆ ఐదు పిల్లర్లు ఏమిటో చెప్పారు. ‘మనం బతకాలి.. బతికించుకుంటూ ముందుకెళ్లాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతీయ ఉత్పత్తులనే వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here