ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం ఇదేనా.. కేంద్రం ఆందోళన

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ‌లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధితులతో కాంటాక్ట్ అయినవారి గుర్తించడం, క్వారంటైన్, కంటెయిన్‌మెంట్ చర్యల్లో జాప్యం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగి జాతీయ గ్రాఫ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ వారంలో పాజిటివ్ కేసుల రెట్టింపు సమయం 12 నుంచి 10 రోజులకు పడిపోవడం, స్థిరంగా ఉన్న కోవిడ్ -19 గ్రాఫ్‌‌లో మార్పు, లాక్‌డౌన్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదంలో పడ్డారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో మరణాలు రేటు పెరుగుతోందని, ఢిల్లీలో స్థిరంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువ విస్తీర్ణం, అధిక జనసాంద్రత కలిగిన ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్ సక్రమంగా అమలుచేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమయ్యిందనే వాదన వినిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నా పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. అయితే కేంద్ర, రాష్ట్ర అధికార యంత్రాంగం మధ్య మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రత్యేకించి పెద్ద మురికివాడలలో ట్రాకింగ్, నిఘా మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. అయితే, ఉన్నతాధికారుల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

అహ్మదాబాద్‌లో కేవలం ఔషధాలు, పాలు సరఫరాకు మాత్రమే అనుమతిస్తున్నారు. మే 14 వరకు నిత్యవసరాలు, కూరగాయలు సహా అన్ని దుకాణాలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సూరత్‌లోనూ మున్సిపల్ అధికారులు ఇదే చర్యలు చేపట్టారు. మరోవైపు, మహమ్మారి ఉద్ధృతి కొనసాగడంతో లాక్‌డౌన్‌ను మే చివరి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రతిపక్షాలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ఉద్ధవ్.. వారి సూచనలు, సలహాలను స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here