ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు కరోనా రోగులు మృతి

రష్యాలో ఘోర అగ్రిప్రమాదం జరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. హాస్పిటల్ వెంటిలేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. మరణించిన రోగులంతా వెంటిలేటర్ లోనే ఉండటం వల్ల మృతి చెందారు.

సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులతో పాటు మొత్తం 19మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఈ ప్రమాదం జరిగినట్లుగా అక్కడి అధికారులు ధ్రువీకరించారు. కానీ మృతుల సంఖ్య మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. వెంటిలేటర్ లోని షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో హాస్పిటల్ లో ఉన్న 150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించామని దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత శనివారం మాస్కోలోని ఓ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభించినప్పుడు అక్కడ కరోనాకు చికత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మరణించారు. రష్యాలో సోమవారం 11,656 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2 లక్షల 21 వేలకు పెరిగింది. మరణాల సంఖ్య రెండువేలకు పైగానే ఉంది. రష్యా రాజధాని మాస్కోలోనే 6,169 కేసులు రికార్డయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here