పెళ్లికొడుకు ఆత్మహత్య.. వివాహం వాయిదా పడిందని.. కర్నూలులో విషాదం

కరోనా రూపంలో పెళ్లికి ఆటంకం రావడంతో తట్టుకోలేకపోయిన పెళ్లికొడుకు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివాహం వాయిదా పడిందని తెలియడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది.

పట్టణంలోని ఎద్దుల మార్కెట్ ప్రాంతానికి చెందిన నాగరాజు(20) అనే యువకుడికి ఇటీవల పెద్దలు వివాహం నిశ్చయించారు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈలోగా కరోనా విజృంభించడంతో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read:

గత్యంతరం లేని పరిస్థితుల్లో నాగరాజు వివాహం వాయిదా పడింది. పెళ్లి వాయిదా పడిందని తెలిసి మనస్థాపానికి గురైన చేసుకున్నాడు. ఎమ్మిగనూరు రూరల్ మండలంలోని గుడికల్లు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here