ట్రిపుల్ తలాక్ విషయం లో అనేక ఇబ్బందులు ఎదురు కొంటున్నారు ముస్లిం మహిళలు. ఈ విషయం మీద దేశం మొత్తం చర్చ సాగుతూ ఉండగా ఉత్తరఖాండ్ లో కొత్త తలాక్ తలనొప్పి మొదలైంది. హిందువు గా మరతా అని ట్రిపుల్ తలాక్ బాధితురాలు గొడవ చెయ్యడం విశేషం. తనకు హిందువుగా మారడం కాని, ఆత్మహత్య చేసుకోవడం కాని తప్ప ఇతర మార్గం లేదని షమీమ్ జహాన్ అనే త్రిపుల్ తలాఖ్ బాధితురాలు చెప్పారు.
భర్త ఆసిఫ్ ఆమెకి మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు అని ఆమె కంప్లైంట్ చేస్తున్నారు. 12 ఏళ్ళ పెళ్లి జీవితం తరవాత భర్త తననీ తన నలుగురు పిల్లలనీ వదిలేయాలని అనుకోవడం తో ఆమెకి చావే గతి అని ఆమె అంటున్నారు. తాను హిందూమతంలోకి మారితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ” హిందూ మతం లో ఇలాంటి ఆచారాలు ఉండవు , ఆత్మహత్య అయిన చేసుకుంటా లేదా ఆ మతం లోకి మారిపోత ” అన్నారు ఆమె.